అనగనగా ఒక ఊరిలో చాలా మంది గొర్రెల కాపర్లు ఉండేవారు. రోజు ఆ కాపర్లు అందరు కలిసి గోరీలనిటిని ఒక కొండ మీదకి తీసుకెళ్ళే వారు. ఆ గొర్రెలు అక్కడ గడ్డి మీసేవి. కాపర్లు రోజంతా అక్కడ వుండి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవారు.
ఇలా ఉండగా ఒక రోజు ఒక కాపరి అబ్బాయి “నాన్న నన్నూ నీతో తీసుకు వెళ్ళవా, నేను వస్తాను” అని ఆడిగాడు. గొర్రె కాపరి, “వద్దురా అక్కడ నీకు ఏమి ఉండదు, అస్సలు తోచదు” అని యెంత చెప్పినా విన కుండా పంతం పట్టి మొండి చేసాడు ఆ అబ్బాయి. మొత్తానికి పోరు పడలేక “సరే, రా!” అని ఆ గొర్రె కాపరి ఆ రోజు కొడుకుని కూడా తోడుగా తీసుకుని వెళ్ళాడు.
మొదట్లో అబ్బాయి కి చాలా నచ్చింది. తెల్లవార గానే బయలుద్యారారేమో, ఆ చల్లటి వాతావరణం, చుట్టూరా గొర్రెలు, ఆ కొండ, కొండమీద సూర్యోదయం, అన్ని అందంగా, ఆహ్లాదకరంగా అనిపించాయి. అబ్బాయి చాలా సంబర పడుతూ, సంతోషంగా వున్నాడు.
అదే మధ్యానం అయ్యే సరికి, మండే సూర్యుడు, పెద్దలందరూ గొర్రెలు కాస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉండడంతో ఆ పిల్లాడికి ఏమి తోచ లేదు. అక్కడ వాళ్ళ నాన్న చెప్పినట్టే అతనికి ఏ పని లేదు.
కొంత సేపు ఏదో కాలక్షేపం చేసుకున్నాడు, కాని ఆ తరువాత అంతా చాలా బోరింగ్ గా అనిపించింది. ఏదైనా జరిగితే బాగిండును అనిపించింది.
ఆకస్మికంగా ఓక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే మంచి, చెడు ఆలోచించ కుండా, గట్టి గా, “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని కేకలు పెట్టడం మొదలెట్టాడు.
కేకలు విన్న గొర్రె కాపర్లందరూ చేతికి దొరికిన రాళ్ళు, రప్పలు, కత్తులు, కర్రలూ తీసుకుని ఆత్రుతగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే అక్కడ ఏ పులి లేదు. అందరు ఆ అబ్బాయి వంక కోపంగా చూసారు. వాళ్ళని అలా చూస్తే అబ్బాయికి బాగా నవ్వొచ్చింది. పెద్దలు తల ఒప్పుకుంటూ వెళ్లి పోయారు.
ఇదేదో బాగందని, అందరు మళ్ళి పనుల్లో బిజీగా అయిపోయాక, మళ్ళి గట్టిగా “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని అరుపులు మొదలెట్టాడు.
మళ్ళీ అందరూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, రాళ్ళు రప్పలు, కత్తులు, కర్రలు, వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఏ పులి లేదని చూడగానే ఈ సారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అబ్బాయిని బాగా తిట్టి, మళ్ళీ ఇలా చేయొద్దని బాగా మందలించారు. వాళ్ళ కోపం చూసి, హెచ్చరిక విన్న అబ్బాయి భయ పడ్డాడు. మళ్ళీ ఇలా చేయకూడదని అనుకునాడు.
కొంత సేపటికి నిజంగా అక్కడకి పులి వచ్చింది. అబ్బాయి చాల భయ పడ్డాడు. గట్టిగా మళ్ళి “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని అరిచాడు.
కపర్లంతా ఆ అబ్బాయి మళ్ళీ ఊరికే అరుస్తున్నడు అనుకున్నారు. ఈ సారి ఎవ్వరు సహాయానికి రా లేదు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ అబ్బాయిని పట్టించుకో లేదు.
ఆ అబ్బాయి దేగ్గిరున్న చెట్టు ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు. పులి మట్టుకు దేగ్గిరలో ఉన్న ఒక గొర్రెను చంపేసింది. యెంత తినాలో అంత తిని వెళ్లి పోయింది.
భయంతో ఆ అబ్బాయి మట్టుకు రోజంతా చెట్టు మీదే ఉన్నాడు. ఆకలి, దాహం అన్ని మరిచిపోయి ఏడుస్తూ రోజంతా గడిపాడు.
సూర్యాస్తమం అవుతుంటే కాపర్లంతా తిరిగి వెళ్తూ ఆ అబ్బాయిని కూడా తీసుకు వెళ్దామని వెతుకుతూ వుంటే చెట్టు మీంచి దిగి జరిగినది అంతా చెప్పాడు. ఆ పులి చంపిన గొర్రెను చూపించాడు.
రాత్రి ఇంటి కి వెళ్లి జరిగినదంతా అమ్మతో చెప్పుకున్నాడు. “యెంత పిలిచినా ఎవ్వరు రాలేదమ్మా! చాలా భయమేసింది!” అని చెప్పుకున్నాడు.
“ఒక్క సారి నువ్వు అబద్ధాలూ ఆడతావని అనుకుంటే, తరవాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరు నామారు బాబు” అని చెప్పింది వాళ్ళ అమ్మ.
ఆ రోజు తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు అబద్ధాలూ ఆడలేదు, కాని అతని కథ మట్టుకు ఈ రోజుకీ మనం అనాదరం చెప్పుకుంటున్నాము.